నేటితో రోహిణికారై సమాప్తం వర్షాలు కురుసే అవకాశం!
అమరావతి: నేటితో రోహిణికారై సమాప్తం అయింది.రేపటి నుంచి మృగశిర కారై ప్రారంభం అవుతంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు చురుగ్గా వుండడంతో సోమ, మంగళవారాల్లో: అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అలాగే రేపు రాష్ట్రంలోని 56 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 67 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
42°C – 44°C నమోదు కాగల జిల్లాలు:– శ్రీకాకుళం,విజయనగరం, మన్యం,అల్లూరి,పోలవరం,కాకినాడ, తూగో,పగో,ఏలూరు,కృష్ణా,ప్రకాశంలు…
40°C – 42°C నమోదు కాగల జిల్లాలు:– కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాలు వున్నాయి.

