సిగాచి కెమికల్ ఇండస్ట్రీలో రియాక్టర్ ప్రేలి 8 మంది మృతి
తెలంగాణ: సంగారెడ్డి జిల్లా పఠాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక ఇండస్ట్రియల్ పార్కులోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం ఉదయం ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయింది.. దీంతో 8 మంది కార్మికులు మృతిచెందారు.. సంఘటనా స్థలంలో 5 మరణించాగా,,ఆసుపత్రిలో మరో 3 మరణించారు..మరో 20 మంది వరకు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.. సోమవారం ఉదయం 6 గంటలకు రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి..ఈ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి.. పేలుడు ధాటికి రియాక్టర్ వద్ద పనిచేస్తున్న కార్మికులు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు.. ప్రొడక్షన్ విభాగం కుప్పకూలి పోగా మరో భవనానికి బీటలు వారింది..ఉదయం షిఫ్ట్ కు వచ్చిన కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు.. మంటల్లో చిక్కుకున్న 50 నుంచి 60 మంది కార్ముకులను బయటకు తీసుకువచ్చారు.. తీవ్రంగా గాయపడిన కార్మికులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు..కార్మికుల విషయం వివరాలు తెలియాల్సి ఉంది.. ప్రమాద స్థలాన్ని సంగారెడ్డి కలెక్టర్ ప్రావిణ్య, ఎస్పీ పంకజ్ తదితరులు పరిశీలించారు.. సహాయక చర్యలో ఫైర్, రెవన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.