DEVOTIONALNATIONALOTHERS

అయోధ్య రామ్ లల్లా ఆలయంలో శ్రీ రామ్ యంత్రాన్ని ప్రతిష్ఠించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

అమరావతి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పవిత్రమైన అయోధ్య ధామంలోని శ్రీ రామ్ జన్మభూమి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, శ్రీ మాతా అమృతానందమయి,ఇతర ప్రముఖుల సమక్షంలో రాష్ట్రపతి ఆ దివ్య ఆలయంలో శ్రీ రామ్ యంత్రాన్ని ప్రతిష్ఠించారు. ఆమె రామ్ లల్లా ఆలయంలో దర్శనం, హారతి ఇచ్చి, అందరి సుఖసంతోషాల కోసం శ్రీ రామ్ లల్లాను ప్రార్థించారు. ఆలయ నిర్మాణంలో పనిచేసిన సుమారు ఆరువేల మంది కార్మికులను, అంగడి వ్యాపారులను, కళాకారులను ఈ కార్యక్రమానికి రామజన్మభూమి ఆలయ ట్రస్టు ఆహ్వానించింది. శ్రీరామ యంత్రాన్ని రాష్ట్రపతి ప్రతిష్ఠించి, హారతి ఇచ్చారు. అనంతరం టెంపుల్ కాంప్లెక్స్‌ లోని ఏడు ఆలయాలను రాష్ట్రపతి దర్శించారు. ఈ రోజుతో రామ్‌లల్లా నిర్మాణం పూర్తి కావడం విశేషమని, యావద్దేశ ప్రజలే కాకుండా విదేశీయులు సైతం ఇక నుంచి పూర్తి ఆలయాన్ని దర్శించుకోవచ్చని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహరాజ్ తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *