మిస్ యూనివర్స్ ఇండియా 2025గా మణిక విశ్వకర్మ
అమరావతి: రాజస్థాన్కు చెందిన మణిక విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా 2025గా నిలిచారు.. జైపూర్లో నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచిన అమెకు గత సంవత్సరం మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ను గెలుచుకున్న రియా సింఘా,,కిరీటం అలంకరించింది.. నవంబర్లో థాయ్లాండ్ వేదికగా జరిగే 74వ మిస్ యూనివర్స్ పోటీలో భారత్ తరఫున మణిక విశ్వకర్మ ప్రాతినిధ్యం వహించనున్నారు.. శ్రీగంగానగర్కి చెందిన మణిక ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఉంటు,,పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు.. జాతీయ స్థాయి కళాకారిణిగా గుర్తింపు పొందిన ఆమెకు క్లాసికల్ డాన్స్,,చిత్రలేఖనంలో ప్రావీణ్యం ఉంది.. మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 టైటిల్ను సైతం గత సంవత్సరం గెలుచుకున్నారు..సేవా రంగంలోనూ మణిక తన సేవలు అందించేందుకు “న్యూరోనోవా” అనే సంస్థను స్థాపించి (ADHD) న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడే వారికి సహాయం అందిస్తున్నారు..విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించిన బిమ్స్ టెక్ సెవోకాన్లో భారత్ తరఫున ప్రతినిధిగా పాల్గొన్నారు..ఉత్తర్ ప్రదేశ్కు చెందిన తాన్య శర్మ ఫస్ట్ రన్నరప్గా,, మెహక్ ధింగ్రా సెకండ్ రన్నరప్గా,, హర్యానాకు చెందిన అమిషి కౌశిక్ మూడో రన్నరప్గా నిలిచారు.