మన సాయుధ దళాలు చేసిన సాహసానికి భారతదేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుంది-ప్రధాని మోదీ
అమరావతి: ఆపరేషన్ సిందూర్’ తో ఉగ్రవాదులు,,వారిని ఉసిగొల్పిన ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్కు గుణపాఠం చెప్పిన అంకం దాదాపుగా ముగిసింది అనే చెప్పుకోవాలి..ఈ నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పంజాబ్లోని అడంపూర్ వైమానిక స్థావరానికి సందర్శించారు..మంగళవారం ఉదయం ప్రధాని మోదీ ఆదంపూర్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు..ఆయన వైమానిక దళంలోని సైనికులతో సంభాషించారు..ఈ సందర్బంలో వైమానిక దళ సిబ్బంది ప్రస్తుత పరిస్థితులను గురించి ప్రధాని మోదీకి వివరించారు..మోదీ పర్యటనకు సంబంధించిన ఒక ఫోటోలో, ప్రధాని మోదీ వెనుక ఒక భారతీయ యుద్ధ విమానం కనిపిస్తుంది..దానిపై శత్రు పైలట్లు ఎందుకు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు? అని రాసి ఉంది..సోమవారం (మే 12 రాత్రి 8 గంటలకు) ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు..ఈ సమయంలో ఆయన పాకిస్తాన్-భారత్ మధ్య వివాదం గురించి వివరించారు..భారత సైన్యాన్ని ప్రశంసిస్తూ,, మన సైన్యం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు తగిన సమాధానం ఇచ్చిందన్నారు..
ఆదంపూర్ వైమానిక స్థావరానికి చేరుకున్నప్రధాని మోదీ ఆయన ఆర్మీ సిబ్బందిని కలుసుకుని ఆపరేషన్ గురించి కూడా చర్చించారు..ఈ సందర్బంలో ప్రధాని మోదీతో ఫోటోలు దిగేందుకు సైనికులు ఉత్సహాం చూపించారు..ఈ సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ,,ఈ ఉదయం AFS అదంపూర్ వెళ్లి మన ధైర్యవంతులైన వైమానిక యోధులను, సైనికులను కలిశానని వెల్లడించారు..ధైర్యం,,దృఢ సంకల్పం,,దేశభక్తి,,నిర్భయానికి ప్రతిరూపంగా నిలిచే వారితో ఉండటం చాలా ప్రత్యేకమైన అనుభవం అన్నారు.. మన దేశం కోసం మన సాయుధ దళాలు చేసే సాహసానికి భారతదేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.