భారతీయ విద్యార్థులు, నిపుణులు ఏఐని ఎలా ఉపయోగించుకోవాలి-ప్రధాని
సుందర్ పిచాయ్ తో…
అమరావతి: ప్రపంచంలో ఆర్టిఫీయల్ ఇంటెల్ జెన్స్ రాకతో వేగంగా మారుతున్న పరిస్థితులను భారతదేశం అంతకన్న వేగంగా అందిపుచ్చుకునేందుకు ప్రధాన మంత్ర నరేంద్ర మోదీ సారధ్యంలో దేశ రాజధాని ఇంద్రప్రస్తలో జరుగుతున్న “AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026” సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పలువురు ప్రపంచ దేశాధినేతలు, పారిశ్రామిక దిగ్గజాలతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్తో సమావేశమయ్యారు. కృత్రిమ మేధ (AI) రంగంలో భారత్ చేస్తున్న కృషి, అలాగే భారతీయ విద్యార్థులు, నిపుణులతో కలిసి గూగుల్ ఈ AI రంగంను సమర్దవంతంగా ఎలా ఉపయోగించుకోవచ్చనే అంశంపై ఆయనతో చర్చించారు.ఈ సమావేశం గురించి ప్రధాని మోదీ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

