BUSINESSNATIONALOTHERS

అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ దాడులు

అమరావతి: ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్‌ అంబానీపై మనీలాండరింగ్‌ ఆరోపణలురావడంతో అనిల్‌ అంబానీకి చెందిన సంస్థలపై ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు గురువారం, ఢిల్లీ, ముంబై నగరాల్లోని దాదాపు 40కిపైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తూన్నారు..సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (CBI) దాఖలు చేసిన రెండు FIRల ఆధారంగా ED  ఈ చర్యలు చేపట్టినట్లు తెలిసింది..

2017-19 మధ్య YES BANK నుంచి అనిల్‌ అంబానీ దాదాపు రూ.3 వేల కోట్ల రుణం తీసుకొని దారి మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి.. గ్రూప్‌ కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంకు ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ ఆరోస్తొంది..ఈ కేసులో అనిల్‌ అంబానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను కూడా విచారిస్తున్నారు..దాదాపు 50 సంస్థలు, 25 మందిపై కేసులు నమోదైనట్లు తెలిసింది..

నిధులను దుర్వినియోగం:- ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అనిల్‌ అంబానీని ఇప్పటికే ఫ్రాడ్‌గా గుర్తించింది..రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, దాని అనుబంధ సంస్థలు SBIతో సహా వివిధ బ్యాంకుల నుంచి మొత్తం రూ.31,580 కోట్ల రుణాన్ని తీసుకున్నట్టు ఫిర్యాదు ఆధారంగా తెలుస్తున్నది..నిధులను దుర్వినియోగపర్చినట్టు తాము గుర్తించామని ఆర్‌కామ్‌కు పంపిన లేఖలో SBI స్పష్టం చేసింది.. నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌కామ్‌ నిధులు మళ్లీస్తున్న నేపధ్యంలో దీన్నో మోసపూరిత రుణంగా వర్గీకరించాలని తమ ఫ్రాడ్‌ ఐడెంటిఫికేషన్‌ కమిటీ తీర్మానించినట్టు తెలిపింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *