NATIONALOTHERSWORLD

ఇజ్రాయిల్,ఇరాన్ ల మధ్య కాల్పుల విరమణ

అమరావతి: ఇరాన్‌తో ద్వైపాక్షిక కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని అంగీక‌రిస్తున్న‌ట్లు ఇజ్రాయిల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెత‌న్య‌హూ ప్రకటించారు..ఒక‌వేళ ఇరాన్ విరమణ ఒప్పందాన్ని అతిక్ర‌మిస్తే,,తీవ్ర స్థాయిలో దాడులకు దిగుతామ‌న్నారు..గ‌త 11 రోజులుగా ఇజ్రాయిల్‌,,ఇరాన్ మ‌ధ్య తీవ్ర స్థాయిలో మిసైల్స్,,డ్రోన్స్,,వైమానిక దాడులు జ‌రిగాయి..ఇరాన్‌లోని న్యూక్లియ‌ర్ స్థావరాలపై అమెరికా బాంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసిన త‌రువాత‌నే ఇరు దేశాల మ‌ధ్య కాల్పుల విమ‌ర‌ణ ఒప్పందం కుదిరిన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ మంగళవారం ఉదయం ప్ర‌క‌టించారు..కాల్పుల విరమణ ఒప్పందంను అంగీక‌రిస్తున్న‌ట్లు ఇజ్రాయిల్ ప్ర‌ధాని కార్యాల‌యం ప్ర‌ట‌క‌న చేసింది..క్యాబినెట్‌,,ర‌క్ష‌ణ మంత్రి,,ఐడీఎఫ్ చీఫ్‌,, మొసాద్ అధినేత‌తో పాటు కీల‌క నేత‌లతో ప్ర‌ధాని నెత‌న్య‌హూ చ‌ర్చించార‌ని,, ఆప‌రేష‌న్ రైజింగ్ ల‌య‌న్ ల‌క్ష్యాల‌ను చేధించినట్లుత ప్రధాని కార్యలయం ప్ర‌క‌టించింది..న్యూక్లియ‌ర్,,బాలిస్టిక్ మిస్సైళ్ల నుంచి ఇజ్రాయిల్ కు పొంచి ఉన్న ప్ర‌మాదం తొలగిపోయింద‌ని ఇజ్రాయిల్ వెల్లడించింది..ఇరాన్ గ‌గ‌న‌తలాన్ని పూర్తిగా ఐడీఎఫ్ ఆధీనంలో తీసుకున్న‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు..ఇరాన్‌లో కీల‌క టార్గెట్ల‌పై దాడులు చేశామ‌ని,,ఆ దేశ సైనిక నేత‌ల‌ను హతమర్చిన‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.. త‌మ‌కు స‌పోర్టు ఇచ్చినందుకు,, అణు భ‌యాన్ని తొల‌గించినందుకు అమెరికాకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ఇజ్రాయిల్ పేర్కొన్న‌ది.. ఆప‌రేష‌న్ రైజింగ్ ల‌య‌న్ ల‌క్ష్యాలు నెర‌వేరిన సంద‌ర్భంగా,, ప్రెసిడెంట్ ట్రంప్ చొరవతో ద్వైపాక్షిక కాల్పుల విరమణకు అంగీక‌రించామ‌ని ఇజ్రాయిల్ ప్రధాని కార్యలయం వెల్లడించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *