NATIONALPOLITICS

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చెంపదెబ్బ

అమరావతి: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చెంపదెబ్బ తగిలింది.బొగ్గు కుంభకోణంలో మానీ ల్యాండరింగ్ అరోపణలపై జనవరి 8న కోల్‌కతాలోని ఐ-ప్యాక్ (I-PAC) కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్న సమయలో,మమతా బెనర్జీ,ఈడీ అధికారులను బెదిరించి మరి అక్కడ వున్న ఫైల్స్,హర్డ్ డిస్క్ లను తీసుకుని వెళ్లింది.అంతే కాకుండా ఈడీ అధికారులపై ఎదురు కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులపై నమోదైన FIR లపై స్టే విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ సందర్బ:లో కొన్ని కఠినమైన వ్యాఖ్యలు చేసింది. ఇది చట్ట ఉల్లంఘన కిందికి వస్తుందని అభిప్రాయపడింది. కేంద్ర దర్యాప్తు సంస్థల పనిలో రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం తీవ్రమైన విషయమని, ఇది ‘అరాచకానికి’ దారితీస్తుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *