కాంగ్రెస్ బుజ్జగింపు, ఓటు బ్యాంకు అనే ఈ విషం నుంచి ఆస్సాంను కాపాడాలి-ప్రధాని మోదీ
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో బాగంగా ఆదివారం (21వ తేదిన) నమ్రప్ చేరుకున్నారు. అస్సాం వ్యాలీ ఫర్టిలైజర్ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్ అమ్మోనియా-యూరియా ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు..అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, అస్సాం తోపాటు మొత్తం ఈశాన్య ప్రాంతాలకు శుభదినం అని,, నమ్రప్, దిబ్రుగఢ్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న కల నిజమవుతోందన్నారు. ఈ ప్రాంతంలో పారిశ్రామిక పురోగతిలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని ప్రధాని మోదీ చెప్పారు. అస్సాం అభివృద్ధిలో కొత్త వేగాన్ని చేరుకుందని, మీరు కల్పిస్తున్న సౌకర్యలు ఆరంభం మాత్రమే అని ప్రధాని తెలిపారు.
యువతకు శాశ్వత ఉద్యోగాలు లభిస్తాయి:- ఈ ఆధునిక ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించడం రైతు సోదరులందరికీ ఎంతో ఉపయూక్తంగా వుంటుందని,, డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో పరిశ్రమలు, కనెక్టివిటీ లాంటి సహకారం అస్సాం కలలను నెరవేరుస్తోందన్నారు. యువత కొత్త కలలు కనేలా ప్రేరేపిస్తోంది అని ప్రధాని మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో దేశ రైతులు, ఆహార ప్రదాతలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అందువల్ల, రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఎన్డీయే ప్రభుత్వం పెద్ద పీఠం వేస్తోందని అన్నారు. ఈ ప్లాంట్ పని ప్రారంభించిన తర్వాత, చాలా మందికి ఇక్కడ శాశ్వత ఉద్యోగాలు లభిస్తాయని,, ఈ ప్లాంట్తో సంబంధం ఉన్న అన్ని పనులు స్థానిక నివాసితులకు, ముఖ్యంగా యువతకు ఉపాధిని కల్పిస్తాయని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధిరానం చేపట్టిన తరువాత. కాంగ్రెస్ పార్టీ సృష్టించిన సమస్యలను పరిష్కరిస్తోందన్నారు.ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటివరకు దాదాపు రూ.4 లక్షల కోట్లు రైతుల ఖాతాలకు బదిలీ అయ్యాయని అన్నారు.
కాంగ్రెస్ బుజ్జగింపు, ఓటు బ్యాంకు అనే ఈ విషం నుంచి:- కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ జాతి వ్యతిరేక ఆలోచనలను ప్రోత్సహిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. వారు బంగ్లాదేశ్ చొరబాటుదారులను అస్సాం అడవులు, భూములలో స్థిరనివాసలు ఏర్పాటు చేయాలని కోరుకుంటుదన్నారు. వారు తమ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవాలనుకుంటున్నారే తప్ప వారు మీ గురించి పట్టించుకోరని,, కాంగ్రెస్ పార్టీకి మీ గుర్తింపుతో ఎటువంటి సంబంధం లేదని ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అక్రమ వలసదారులను స్థిరపరిచిందని, వారిని రక్షిస్తోందని,, అందువల్లే కాంగ్రెస్ పార్టీ ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తోందని తెలిపారు. అసోం గుర్తింపు, గౌరవాన్ని కాపాడుకోవడానికి బీజేపీ ఉక్కు కవచంలా అండగా నిలుస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ బుజ్జగింపు, ఓటు బ్యాంకు అనే ఈ విషం నుండి మనం అస్సాంను రక్షించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

