కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ
నెల్లూరు: అధునాతన టెక్నాలజీతో రూపొందించిన కంటైనర్ సబ్ స్టేషన్ తో ఎన్నో లాభాలు ఉన్నాయని మంత్రి నారాయణ అన్నారు.శనివారం 46వ డివిజన్ గాంధీ బొమ్మ వద్ద ఉన్న స్వతంత్ర పార్కులో 4 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో ఏపీ ఎస్పీడీసీఎల్ అధ్యర్యంలో నిర్మించనున్న కంటైనర్ సబ్స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులో తొలిసారిగా కంటైనర్ సబ్స్టేషన్ను చేయడం జరిగిందన్నారు. ఇది పూర్తిగా రిమోట్ ఆధారిత సబ్ స్టేషన్ అని తెలిపారు. మామూలుగా విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుకు సుమారుగా ఐదు నుంచి పది ఎకరాల వరకు స్థలము అవసరం ఉంటుందని, అయితే సాంకేతికతను ఉపయోగించి అతి తక్కువ స్థలంలో కంటైనర్ సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. కంటైనర్ సబ్స్టేషన్కు కేవలం నాలుగు లేదా ఐదు సెంట్లు స్థలంలో రూపకల్పన చేయడం జరిగిందని తెలిపారు. గాంధీ బొమ్మ సెంటర్, పోగతోట, ట్రంకు రోడ్డు, తదితర ప్రాంతాలలో విద్యుత్ హెచ్చుతగ్గులు లేకుండా నిరంతర విద్యుత్తును అందించే విధంగా ఉపయోగపడుతుందన్నారు. సబ్స్టేషన్ ద్వారా దాదాపు 5000 మంది వినియోగదారులకు ఉపయోగం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్,నూడా ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ ,46వ డివిజన్ ప్రెసిడెంట్ కోకు మహేందర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ సత్యనాగేశ్వర రావు…కో క్లస్టర్ అజయ్.ఏపీ ఎస్పీడీసీఎల్ సూపరిండెంట్ ఇంజనీర్ విజయం,టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు..