DISTRICTS

హరనాధపురుం సెంటర్ లో యోగాసనాల కళాకృతుల నిర్మాణ కమిషనర్ నందన్

నెల్లూరు: నగర సుందరీకరణ పనులలో భాగంగా యోగాసనాలపై ప్రజలకు ఆసక్తిని పెంపొందించే విధంగా కళాకృతులను, గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ తెలిపారు.మంగళవారం పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక హరనాధపురం కూడలిలో నూతనంగా నిర్మిస్తున్న యోగాసనాల కళాకృతుల నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలో వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *