AP&TGCRIME

లిక్కర్ స్కాంలో 1000 కిలోల బంగారం కొన్న మద్యం మాఫియా?

అమరావతి: రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.. తీగ లాగితే డొంక అంతా కదిలినట్లుగా ఒక్కొక్కటిగా ఆసలు విషయాలు బయటకు వస్తోన్న విషయాలు నోరెళ్ళబెట్టేలా చేస్తున్నాయి.. ఇప్పటికే స్కామ్ నగదుతో జగన్ సన్నిహితులు 1000 కోట్లతో బెంగళూరులో రియల్ ఎస్టేట్ బిజినెస్ నడిపించారనే? విషయం బయటకు రాగా ఎవ్వరు ఊహించని విధంగా ఫేక్ మద్యం కంపెనీలు సృష్టించి సదరు కంపెనీ అధిపతులు, భారీగా బంగారం కొనుగోలు చేసినట్లుగా? తెలుస్తోంది.. మొదట 400 కిలోల బంగారం కొనుగోలు చేశారనుకున్నా దర్యాప్తు అధికారులు, అది 1000 కిలోల వరకు ఉండొచ్చునని? ప్రచారం జరుగుతోంది.. బంగారం వ్యాపారం అధికంగా జరిగే ముంబై మార్కెట్, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచి 200 కోట్ల విలువైన బంగారం కొనుగోలు చేసినట్లుగా సిట్ గుర్తించినట్లు సమాచారం? ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేలా మిగతాది ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసినట్లుగా? గుర్తించారు. బంగారం కొనుగోలు చేసిన తర్వాత మద్యం కంపెనీల అధినేతలు…రాజ్ కే..రెడ్డి బృందానికి పంపేవారని తెలుస్తోంది…ఆ బంగారం విదేశాలకు పంపి, నగదుగా మార్చి దాన్ని రియల్ ఎస్టేట్, సినిమా రంగాల్లో పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తోంది…ఎవరెవరు బంగారం కొనుగోలు చేసి, రాజ్ కే..రెడ్డి బృందానికి పంపారు? ఆ బంగారాన్ని విదేశాలకు ఎలా పంపారు???

ఇందుకోసం రాజ్ కే..రెడ్డికి ఎవరెవరు తోడ్పాటు అందించారు?? అనే విషయాలపై సిట్ ప్రస్తుతం ఫోకస్ పెట్టింది..మరోవైపు ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని భావిస్తున్న ఈడీ… నిందితుల విచారణకు అనుమతి కోరింది…అనుమతి రాగానే ఈ కేసులో నగదు లావాదేవీలు, బంగారం కొనుగోలు వంటి వాటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపనున్నది? దింతో ఎంత పెద్ద అనకొండలు బయటకు వస్తాయో? వేచి చూడాలి…

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *