AP&TGDEVOTIONALOTHERS

డిసెంబర్‌ 30 నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలు: తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు

తిరుమల: వైకుంఠ ఏకాదశిపై తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు.మంగళవారం తితిదే పాలక మండలి సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని,, దీంతో సామాన్య భక్తులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. మొదటి మూడు రోజులు రూ.300, శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 15 వేల రూ.300 దర్శన టిక్కెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్‌ పద్ధతిలో కేటాయిస్తునట్లు చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *