నియోజకవర్గాల పునర్విభజన అంశంపై పిటీషన్ కొట్టి వేసిన సుప్రీంకోర్టు
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది..శుక్రవారం ఈ పిటీషన్ పై విచారించింది.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో పిటిషన్ దాఖలు చేశారు..జమ్ము కశ్మీర్లో పునర్విభజన సమయంలో, ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టేశారని,, ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు..ఈ పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్తో కూడి ధర్మాసనం విచారణ చేపట్టిన సందర్బంలో, రాజ్యాంగంలోని 170(3) అధికరణం ప్రకారం ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26కు పరిమితి ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యనించింది..2026లో మొదటి జనగణన లెక్కల తర్వాతే డీలిమిటేషన్ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని పేర్కొంది..ఈ పిటిషన్ను అనుమతిస్తే మిగతా రాష్ట్రాల నుంచి కూడా డీలిమిటేషన్పై పిటిషన్లు వచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.. జమ్ము కశ్మీర్పై ప్రత్యేక దృష్టిసారించారన్న వాదనను కూడా ధర్మాసనం తిరస్కరించింది..జమ్ము కశ్మీర్ కోసం జారీ చేసిన నియోజకవర్గాల పునర్విభజన నోటిఫికేషన్ నుంచి మినహాయించడం,, ఏకపక్షం, వివక్ష కాదని వ్యాఖ్యనిస్తూ పిటిషన్ను డిస్మిస్ చేసింది.

