సముద్రంలోకి వెళ్లే గోదావరి మిగులు జలాలను మాత్రమే-చంద్రబాబు
కేంద్ర జల శక్తి శాఖ మంత్రి వద్ద..
అమరావతి: సీ ఆర్ పాటిల్ అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం బుధవారం న్యూఢిల్లీలో జరిగింది. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్ ఆవశ్యతను సీఎం చంద్రబాబు వివరించినట్లు తెలుస్తుంది. గోదావరి నుంచి సముద్రంలోకి ఏటా 2 వేల నుంచి 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తాయని తెలిపారు. ఈ నీటిని బనకచర్ల ద్వారా రాయలసీమకు మళ్లిస్తే ఆ ప్రాంతానికి లబ్ది చేకూరుతోందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సోదాహరణగా ఈ సమావేశంలో వివరించారని సమాచారం.
సముద్రంలోకి వెళ్లే గోదావరి మిగులు:- ఇందుకు సంబంధించిన సమగ్ర వివరాలను సైతం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్కు ఆయన అందజేశారు.. ఏ ఒక్క రాష్ట్రానికి ఇబ్బంది కలిగించకుండా,,సముద్రంలోకి వెళ్లే గోదావరి మిగులు జలాలను మాత్రమే వినియోగించుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎజెండాలోని 13 అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.. ఈ సందర్భంగా ఆ ప్రాజెక్ట్ ల విషయంలో సీఎం చంద్రబాబు ఎటువంటి అభ్యంతరం తెలపలేదని తెలుస్తుంది..
మంత్రి నిమ్మల రామానాయుడు:-తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో చర్చలు జరిగాయని తెలిపారు.. శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు..శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి రక్షణ,,మరమ్మతులు చేసేందుకు ఏపీ అంగీకారించిదన్నారు..నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారని పేర్కొన్నారు.. కృష్ణా నది బోర్డు అమరావతిలో ఉండేలా నిర్ణయం తీసుకున్నామని,,అలాగే గోదావరి బోర్డు తెలంగాణలో ఏర్పాటు చేసేలా నిర్ణయించామని తెలిపారు..జల వివాదాల కమిటీలో కేంద్ర,, రాష్ట్రాల నిపుణులు ఉంటారని,,ఈ కమిటీని సోమవారం లోపు ఏర్పాటు చేస్తామన్నారన్నారు.