14 జిల్లాలకు కొత్త ఎస్పీలు-12 జిల్లాల్లో ఎస్పీలు యథాతథం
అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త వారిని,,మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ ఎస్పీలను బదలీ చేసింది..అలాగే 12 జిల్లాలలో ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ డీజీపీ హరీశ్కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు..
ఏడు జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు:- 1.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా- రాహుల్ మీనా,,2.బాపట్ల- ఉమామహేశ్వర్,,3.నెల్లూరు– అజితా వేజెండ్ల,,4.తిరుపతి– సుబ్బారాయుడు,,5.అన్నమయ్య జిల్లా – ధీరజ్ కునుగిలి,,6.కడప– నచికేత్,,7.నంద్యాల్–సునీల్ షెరాన్…
ఇతర జిల్లాల నుంచి బదలీ అయిన ఎస్పీలు:- 1.విజయనగరం- ఏఆర్ దామోదర్,,2.కృష్ణా– విద్యాసాగర్ నాయుడు,,3.గుంటూరు–వకుల్ జిందాల్,,4.పల్నాడు– డి కృష్ణారావు,,5.ప్రకాశం– హర్షవర్థన్ రాజు,,6.చిత్తూరు–తుషార్ డూడి,,7.శ్రీ సత్యసాయి– సతీష్ కుమార్..
యథాతథంగా:- శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాల ఎస్పీలు విధుల్లో కొనసాగుతారు.