అల్పపీడనం ప్రభావంతో ఆది, సోమవారాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
అమరావతి: నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో ఆది, సోమవారాల్లో తూర్పుగోదావరి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశలు వున్నయని ఆంధ్రప్రదేశ్ డిజస్టర్ మేనేజ్ మెంట్ సంస్థ తెలిపింది. అలాగే పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు,అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పిడుగులు పడే అవకాశం వున్నందు వలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

