సంవత్సరంలోపు నివాస స్థలంలేని వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వ చర్యలు-సీ.ఎం
అమరావతి:. పేదలందరికీ ఇళ్లు కల్పించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని,,నివాస స్థలంలేని వారందరి అర్హుల జాబితా రూపొందించి అందరికీ నివేశ స్థలాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రులకు దిశనిర్దేశం చేశారు..సోమవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. సంవత్సరంలోపు నివాస స్థలంలేని వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వ చర్యలు ఉండాలన్నారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకునేలా ఇన్చార్జ్ మంత్రులు చొరవ చూపాలన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో జాప్యం ఉండకూడదని అలాగే త్వరితగతిన సమస్యల పరిష్కారానికి సరైన విధానం రూపొందించాలన్నారు.
పవన్ కల్యాణ్:- ఈ సందర్భంగా చంద్రబాబుతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ,, పెద్దిరెడ్డి ఆక్రమణలపై పూర్తి సాక్ష్యాలతో వీడియోలు తీయించానని చెప్పారు.. పవన్ కల్యాణ్ పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు, సహచర మంత్రులు ప్రశంసించారు. ఎర్ర చందనం డిపో సందర్శనపై తన అనుభవాలను పవన్ క్యాబినెట్లో పంచుకున్నారు.. పట్టుబడిన ఎర్రచందనంతో పరికరాలు తయారు చేయించి విక్రయించే ప్రతిపాదనలు పరిశీలిద్దామని చంద్రబాబు అన్నారు. రెవెన్యూ సమస్యలు ఎజెండాగా పెట్టుకుని ఇన్చార్జి మంత్రులు పరిష్కారం చూపాలని చెప్పారు.అనేక వివాదాలకు సంబంధించి రెండు పార్టీలు రాజీ పడినప్పటికీ కొంతమంది ప్రజాప్రతినిధులు ఒప్పుకోవడం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేలు అందరికి గట్టిగా చెప్పాలని చంద్రబాబును పవన్ కోరారు.జనసేనకు పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు అంశాన్ని కందుల దుర్గేశ్ ప్రస్థావించారు. నిబంధనల ప్రకారం పార్టీ కార్యాలయాల నిర్మాణం చేసుకోవచ్చు అని సీఎం తెలిపారు. 48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై మరోసారి క్యాబినెట్ లో చర్చ జరిగింది.సదరు 48 మంది పనితీరు మార్చుకోవాలని సీఎం సూచించారు.
విశాఖపట్నం:- పార్ట్ నర్షిప్ సమ్మిట్ ద్వారా యువతకు మనం ఏం చేస్తున్నామో తెలియజేయాలని,, పాఠశాలల్లో వాళ్లకు ఎవరికైన ఆసక్తి ఉంటే వాళ్ళు ఈ పార్ట్ నర్షిప్ సమ్మిట్ చూసే విధంగా ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. ఇందుకోసం మంత్రులు పనిచేయాలన్నారు. పార్ట్ నర్షిప్ సమ్మిట్కు ఉప రాష్ట్రపతి వస్తున్నారని,, పుట్టపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా చేయాలన్నారు. ఈ సమ్మిట్కు ప్రెసిడెంట్, ప్రధాని, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, చాలామంది వస్తున్నారని చెప్పారు.

