వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట-మంత్రి ఆనం
పదిరోజుల్లో 182 గంటలు..
తిరుమల: డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో సామన్యులకే పెద్దపీఠ వేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సోమవారం వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై ప్రభుత్వం నియమించిన ముగ్గురు మంత్రుల ఉప సంఘంలోని రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ లతో కలిసి ఆయన టీటీడీ, జిల్లా, పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
వివరాలు ఇలా వున్నాయి:-
పదిరోజుల్లో 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు అంటే దాదాపు 90శాతం సామాన్యులకే కేటాయింపు.
తొలి మూడు రోజుల దర్వనాలకు 27 రాష్ట్రాల నుండి 23.64 లక్షల మంది ఈ-డిప్ కు నమోదు.
1.89 లక్షల మంది సామాన్య భక్తులకు ఈ-డిప్ ద్వారా టోకెన్ల కేటాయింపు.
భక్తులు ఏరోజు, ఏ సమయానికి దర్శనానికి రావాలో సమాచారం అందజేత.
టోకెన్ లేని భక్తులు జనవరి 2 నుండి 8వ తేది వరకు సర్వ దర్శన క్యూలైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలకు అవకాశం.
ఏఐ టెక్నాలజీతో క్యూలైన్ల పర్యవేక్షణ, భక్తుల సంఖ్య, వేచి ఉండే సమయాన్ని అంచనా వేస్తూ క్యూలైన్ల నిర్వహణ.
ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, దేవాదాయశాఖ సెక్రటరీ హరి జవహర్ లాల్, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

