విద్యుత్ శాఖలో ఏడీఈ-ఏసిబి దాడుల్లో బయట పడిన రూ.500 నోట్ల కట్టలు
హైదరాబాద్: విపరీతమై అవినితి ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసిబి అధికారులు 15 బృందాలుగా విడిపోయి, గచ్చిబౌలి , మాదాపూర్ , హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో ఏడీఈ బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. అంబేద్కర్ బంధువు ఇంట్లో రూ. 2 కోట్ల నగదు పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ వెల్లడించారు. భారీగా బంగారం కూడా పట్టుబడింది. ఈ బంగారం విలువను కూడా అధికారులు లెక్కిస్తున్నారు. రూ. 500 నోట్ల కట్టలతో పాటు రూ.200 నోట్ల కట్టలు కొన్ని వున్నాయి. ఈ నగదును లెక్కపెట్టేందుకు కరెన్సీ కౌటింగ్ మిషన్స్ ను ఉపయోగించాల్సి వచ్చింది. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్లో 10 ఎకరాల వ్యవసాయ భూమిని అంబేద్కర్ కొనుగోలు చేశారని పేర్కొన్నారు. అక్కడే మరో వెయ్యి గజాల్లో వ్యవసాయ క్షేత్రం కూడా ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు.సాయంత్రంలోగా మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని,,పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.