ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ
అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో మంగళగిరి జనసేన పార్టీ క్యాంపు కార్యాలయానికి హైడ్రా కమిషనర్ వచ్చారు. ఈ సమావేశం మర్యాదపూర్వకమేనని జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టినప్పుడు ఏపీలోనూ అలాంటి వ్యవస్థ ఉండాలని పవన్ ఆకాంక్షించారు. ఈ క్రమంలో వీరి మీటింగ్ జరగడం ఆసక్తికరంగా మారింది. ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

