ప్రజల అంగీకారం లేకుండా ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించొద్దు-మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి: ప్రజల అంగీకారం లేకుండా ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించొద్దని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను అదేశించారు. ప్రజామోదం లేనిదే ఏ విషయంలోనూ ముందుకు వెళ్లకూడదన్నారు.విశాఖపట్నంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించిన సందర్బంలో అయన మాట్లాడుతూ ప్రస్తుతం పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగించనున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయానికి వీటిని బిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్లపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.శ్రీకాకుళ, విజయనగరం జిల్లాల్లో లో వోల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజను మంత్రి గొట్టిపాటి ఆదేశించారు.

