INS దునగిరి,INS సంశోధక్-INS అగ్రయ్లను అధికారికంగా ప్రారంభించి ప్రధాని మోదీ
బ్రహ్మోస్ ను ప్రయోగించే సత్తా..
అమరావతి: ఒక దేశానికి సముద్ర రంగంలో ఎంతటి బలమైన సామర్థ్యం ఉంటుందో, దాని ఆర్థిక-వ్యూహాత్మక ప్రభావం అంత శక్తివంతంగా ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం కోల్కతాలో INS దునగిరి,INS సంశోధక్-INS అగ్రయ్లను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్బంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ… ఇవి భారతదేశం యొక్క పెరుగుతున్న సముద్ర సామర్థ్యాలను, సముద్రాల మీదుగా జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతతో రక్షణ తయారీలో స్వావలంబన దిశగా సాధిస్తున్న అద్భుతమైన పురోగతిని ప్రతిబింబిస్తాయన్నారు.
2014 నుంచే కీలకమైన విధానపరమైన సంస్కరణలను చేపట్టడడంతో,ఫలితంగా, రక్షణ రంగ ఉత్పత్తిలో వేగవంతమైన వృద్ధితో పాటు, మన రక్షణ రంగ ఎగుమతులు కూడా వేగంగా పెరిగాయని తెలిపారు. నేడు, భారతదేశం తన మొత్తం సముద్ర పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తోందని, దీనివల్ల వాణిజ్య ఖర్చులు తగ్గి, పరిశ్రమలకు కొత్త ఊపు వచ్చి, తీరప్రాంతాలలో సరికొత్త అవకాశాలు ఏర్పడ్డాయని వెల్లడించారు.భారతదేశ స్వయం సమృద్ధిని సాధించి మనం ఉత్పత్తిదారులుగా మారిన రోజున, ప్రపంచంలో నిర్ణయాత్మక శక్తిగానూ ఎదుగుతామన్నారు.
బ్రహ్మోస్ ను ప్రయోగించే సత్తా:- ప్రాజెక్ట్ 17A లో ఐదవదైన దునగిరి స్టెల్త్ ఫ్రిగేట్, బ్రహ్మోస్ ఉపరితలం నుండి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణులు-మధ్య శ్రేణి ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థతో సహా అధునాతన ఆయుధాలు-సెన్సార్లను కలిగి ఉంది. ఇది నౌకాదళం యొక్క పోరాట సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది.
హైడ్రోగ్రాఫిక్ సర్వేలు:- నాలుగవ సర్వే నౌక (పెద్దది) అయిన సంశోధక్ను, తీరప్రాంత మరియు లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ సర్వేల కోసం, అలాగే రక్షణ-పౌర అనువర్తనాల కోసం సముద్ర శాస్త్ర-భూభౌతిక డేటాను సేకరించడానికి రూపొందించారు. ఇది అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్-రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్తో సహా అధునాతన సర్వే వ్యవస్థలను కలిగి ఉంది.
జలాంతర్గామిలను గుర్తించి ధ్వసం:- అర్నాల-తరగతి జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నిస్సార జల నౌకలలో నాలుగవదైన అగ్రయ్, తీరప్రాంత జలాల్లో నీటి అడుగున ఉన్న ముప్పులను గుర్తించి, ఎదుర్కోవడానికి తేలికపాటి టార్పెడోలు, స్వదేశీ రాకెట్ లాంచర్లు-నిస్సార జల సోనార్ వ్యవస్థలతో అమర్చబడింది.

