CRIMENATIONAL

జమ్మూకశ్మీర్‌లో టూరిస్టులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా హహల్గాంలోని ఓ రిసార్ట్‌ పై మంగళవారం మధ్యహ్నం 2.30 గంటల సమయంలో ఉగ్రదాడి జరిగింది.. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో దాదాపు 8 మంది టూరిస్టులు గాయపడినట్టు పోలీసులు తెలిపారు..సమాచారం తెలిసిన వెంటనే పహల్గాం టూరిస్ట్ టౌన్ బైసరన్ ఘాటీకి ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు చేరుకున్నట్టు సీనియర్ అధికారులు ధ్రువీకరించారు.. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.. ఉగ్రవాదులు 3 నుంచి 5 నిమిషాల సేపు కాల్పులు జరిపి పరారయ్యాయనీ,, సుమారు ఐదు నుంచి ఆరుగురు గాయపడ్డారని అధికాలు తెలిపారు..అనంతనాగ్ జిల్లా ఆసుపత్రికి వారిని తరలించగా ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని సమాచారం.. భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగుతుండటంతో గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు.. ఘటనా స్థలికి సహాయక సిబ్బంది చేరుకోగా, పరిస్థితిని అధికారులు అంచనా వేస్తున్నారు..ఈనెల 14వ తేదిన భద్రతా దళాలు కిష్ట్వార్‌ జిల్లాలోని చత్రు అటవీ ప్రాంతలో అత్యంత అధునాతన సౌకర్యాలతో, ముందస్తు వ్యూహంతో ఏర్పాటు చేసిన టెర్రిరిస్టు శిబిరాన్ని భధ్రతా బలగాలు కనిపెట్టాయి.. పాకిస్థాన్ బేస్డ్ జైషే మొహమ్మద్ (జేఈఎం) అనుబంధం టెర్రరిస్టులు దీనిని స్థావరంగా ఉపయోగించుకుంటున్నట్టు భద్రతాధికారులు అనుమానిస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *