BUSINESSNATIONALOTHERS

భారత్‌లో రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడి-మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల

అమారవతి: ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల సమావేశం అయ్యారు. భారత్‌లో పెట్టుబడులపై మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల మంగళవారం ప్రకటన చేశారు. తమ కంపెనీ భారత్‌లో 17.5 బిలియన్‌ డాలర్ల( ఇండియా కరెన్సీలో దాదాపు రూ.1.5 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. భారత్‌ AI-ఫస్ట్ భవిష్యత్తుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సార్వభౌమ సామర్థ్యాలను నిర్మించడంలో సహాయపడటానికి ఈ పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు.

2026 జనవరిలో భారతదేశ పర్యటన:- ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. దేశ ఆశయాలకు మద్దతుగా, భారతదేశ AI మొదటి భవిష్యత్తుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు నిర్మించడంలో సహాయపడటానికి మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద పెట్టుబడి అని కూడా తెలిపారు. 2026 జనవరిలో భారతదేశ పర్యటన సందర్భంగా రాబోయే రెండేళ్లలో క్లౌడ్, AI మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధిలో భారతదేశంలో 3 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని కంపెనీ ప్రణాళికలు వేస్తున్నట్లు నాదెళ్ల ప్రకటించారు. ఇందులో కొత్త డేటాసెంటర్ల స్థాపన కూడా ఉందని వెల్లడించారు.

ప్రధాని మోదీ దార్శనికత:- ఈ పెట్టుబడి భారతదేశంలో AI ఆవిష్కరణలను వేగవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం (విక్షిత్ భారత్)గా మారాలనే గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను సాధించడంలో కీలకమైనది అని తెలిపారు. మైక్రోసాఫ్ట్ తన అడ్వాంటా(I)GE ఇండియా ప్రోగ్రామ్ రెండవ ఎడిషన్‌లో భాగంగా రాబోయే ఐదు సంవత్సరాలలో 10 మిలియన్ల మందికి AI నైపుణ్యాలతో శిక్షణ ఇవ్వడం ద్వారా దేశం దీర్ఘకాలిక పోటీతత్వానికి మద్దతు ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *