వైసీపీ నేత కాకాణి.గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదు
నెల్లూరు: మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కాకాణి.గోవర్ధన్ రెడ్డిపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఆదివారం మరో కేసు నమోదు చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని చవటపాలెం సొసైటీ చైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కాకణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

