ఉద్యోగుల బదిలీలపై మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి: మే 16 నుంచి జూన్ 2వ తేది వరకు రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.. ఒకే చోట 5 ఏళ్ళు విధులు నిర్వహించిన రాష్ట్ర ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.. పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి చేసిన వారిని బదిలీలు చేస్తారు..ఐదేళ్ళు లోపు ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత విన్నపం మేరకు బదిలీలు వుంటాయి..వచ్చే ఏడాది మే 31 లోపు రిటైర్మెంట్ ఉండే ఉద్యోగులకు బదిలీ నుండి మినహాయింపు ఇచ్చారు..అంధుల ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత,,అలాగే మానసిక రుగ్మత ఉన్న పిల్లల తల్లిదండ్రుల వినతి మేరకు బదిలీల్లో ప్రాధాన్యత వుంటుంది..ట్రైబల్ ఏరియాలో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పని చేసిన ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత,,మెడికల్ గ్రౌండ్ లో బాగంగా బదిలీల్లో వినతి మేరకు బదిలీ,,వితంతు ఉద్యోగులకు బదిలీల్లో వారి వినతి మేరకు ప్రాధాన్యత ఇస్తారు..స్పౌజ్ ఉద్యోగుల కు బదిలీలో ఒకే చోట లేదా దగ్గరి ప్రాంతాల్లో బదిలీ చేసేలా ప్రాధాన్యత వుంటుంది.