నాందేడ్ గురుద్వారాను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
మందిరంలో ప్రత్యేక ప్రార్ధనలు..
అమరావతి: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో కలసి నాందేడ్ లోని తఖ్త్ సచ్ కండ్ గురుద్వారాను ఆదివారం సందర్శించారు. సిక్కుల 10వ మత గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. సిక్కుల ఐదు అత్యున్నత పీఠాల్లో ఒకటి అయిన గురు ద్వారా హజూర్ సాహిబాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షాహిదీ సమాగమంలో పాల్గొనేందుకు నాందేడ్ చేరుకున్న పవన్ కళ్యాణ్ మధ్యాహ్న సమయంలో సచ్ ఖండ్ గురు ద్వారాను సందర్శించారు. ఆయనకు గురుద్వారా ఛైర్మన్ డాక్టర్ విజయ్ సత్పాల్ సింగ్ ఆధ్వర్యంలో సాదరంగా స్వాగతం పలికారు. గురు ద్వారా ప్రముఖుల చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ కి సంప్రదాయ సిక్కు తలపాగాను ధరించారు. అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తో కలసి పవన్ కళ్యాణ్ ప్రధాన మందిరంలో శ్రీ గురుగోవింద్ సింగ్ సాయిబాకు ప్రార్ధనలు చేశారు. చాదర్ ను సమర్పించి నమస్కరించారు.
గురువు షాహిదీ సమాగమంలో:- గురుద్వారా సందర్శన అనంతరం పవన్ కళ్యాణ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. గురు తేగ్ బహదూర్ సింగ్ దేశం మొత్తానికి స్ఫూర్తిని నింపారు. ఆయన త్యాగం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని నింపుతుంది. అలాంటి గురువు షాహిదీ సమాగమంలో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అన్నారు.

