భారతదేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి-గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్
వెటర్నరీ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవ..
తిరుపతి: యువత దేశ భవిష్యత్తుకు మూలస్తంభమని… విద్య ద్వారా సాధించిన జ్ఞానాన్ని సమాజ సేవకు వినియోగించాలని రాష్ట్ర పేర్కొన్నారు. సోమవారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, యువతలో ఉన్న శక్తి, సృజనాత్మకత దేశ అభివృద్ధికి కీలకమని తెలిపారు. విద్యార్థులు నైతిక విలువలను పాటిస్తూ తమ వృత్తిని నిబద్ధతతో కొనసాగించాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే విధంగా తమ జ్ఞానం, నైపుణ్యాలను వినియోగించాలన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశమని, ఇది దేశానికి ఒక గొప్ప అవకాశమని గవర్నర్ అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. పశుసంవర్థక రంగం దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగమని, గ్రామీణ ప్రజల జీవనోపాధికి ఇది ఎంతో దోహదపడుతుందని గవర్నర్ తెలిపారు. ఈ రంగంలో సాంకేతికతను వినియోగించి మరింత అభివృద్ధి సాధించాలని సూచించారు.
ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ అత్యంత ప్రతిభ చూపిన 38 మందికి గోల్డ్ మెడల్స్ అందజేశారు.
శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 13వ కాన్వకేషన్ కార్యక్రమంలో మహారాష్ట్ర అనిమల్ అండ్ ఫిషరీస్ సైన్స్స్ యూనివరిటీ, నాగపూర్ వైస్ ఛాన్సలర్ డా.నితిన్ వి పాటిల్, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. జె. వి.రమణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

