AP&TGBUSINESSOTHERS

మిమ్మల్ని చూస్తుంటే రతన్ టాటా గుర్తుకు వస్తారు-చిరంజీవి

హైదరాబాద్: ఆటోమొబైల్,రక్షణ రంగంలో దిగ్గజం కంపెనీగా ఎదిగిన మహీంద్రా & మహీంద్రా కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మెన్స్ ఆనంద్ మహీంద్రాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురుపించారు. మిమ్మల్ని చూస్తుంటే రతన్ టాటా గుర్తుకు వస్తారు అంటూ చిరంజీవి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.ఇటీవల తెలంగాణ లో జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో పలు రంగాల నుంచి దిగ్గజాలు హాజరయ్యారు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి కూడా ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి ఆనంద్ మహీంద్రా కూడా హాజరయ్యారు. ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకుని,,సినిమా రంగంకు సంబంధించిన విషయాలపై మాట్లాడుకున్నట్లు వినికిడి. ఈ నేపధ్యంలోనే,,, చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. “డియర్‌ ఆనంద్‌ మహీంద్రా… మీ వినయం,,మీ విధేయత,, ఎంత ఎదిగినా ఒదిగి వుండే తత్వం నిజంగా ఆదర్శనీయం. చాలా విషయాల్లో మిమ్మల్ని చూసినప్పుడు రతన్‌ టాటాను గుర్తుకు వస్తారు. ఆయన, తన విలువలతో గొప్ప వ్యక్తిగా ఎదిగారు. ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సేవా దృక్పధంలో మీ నిబద్ధత చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది.మీలాంటి వ్యక్తితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి నా కృతజ్ఞతలు” అంటూ పోస్టులో పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *