భావి తరాల భవిష్యత్ కోసమే రాజకీయాల్లో వచ్చాను-ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
జీవితం ప్రజల మధ్యలో మాట్లాడేలా…
విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణం కేవలం ఒక క్యాంపస్ మాత్రమే కాదు. ఇది విలువలతో వ్యక్తిత్వంతో దేశ నిర్మాణంలో భాగస్వామిగా నిలిచి,శతాబ్ద కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భారతీయ వారసత్వ సంపదకు చిహ్నం అని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.బుధవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్నా సందర్బంలో అయన ప్రసంగించారు. చాలా తక్కువ మాట్లాడటానికి ప్రయత్నిస్తాను, కానీ జీవితం మాట్లాడకుండా ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా లక్షల మంది ప్రజల మధ్యలో మాట్లాడేలా చేసిందన్నారు.
