AMARAVATHI

కార్పొరేషన్ లో కమీషనర్ల సంతకాలను ఫోర్జరీ చేసే దొంగలు?

TPOలు,WPRSలు సస్పెన్షన్..

ఫోర్జరీ బాగోతం వెనుక వున్న పెద్ద తలకాయలు ఎవరు ? విజిలెన్స్ నివేదిక పేరుతో కాలయాపన జరిగిపోతుందా ? లేక నిజంగా నివేదిక అందిన వెంటనే కఠిన చర్యలు వుంటాయా?

నెల్లూరు: నగర పాలక సంస్థలో ఉద్యోగల ముసుగులో వున్న సంతకాల ఫోర్జరీ చేసిన 4గురు దొంగలను కమిషనర్ వికాస్ మర్మత్ శుక్రవారం వారిని విధులనుంచి తొలగిస్తూ సస్పెన్షన్ ఉత్తర్వులను కమిషనర్ జారీ చేశారు.. కమిషనర్ వికాస్ మర్మత్,,నగర పాలక సంస్థ గత కమిషనర్ శ్రీమతి.హరిత సంతకాలను ఫోర్జరీ వ్యవహారంలో ముందస్తు విచారణ అనంతరం టౌన్ ప్లానింగ్ అధికారులు 2,, మరో 2 సచివాలయ వార్డు ప్లానింగ్ అండ్ రెగులేషన్ కార్యదర్శులను బాధ్యులుగా గుర్తించి వారిని విధులనుంచి తొలగిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు..నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టి.పి.ఓ) లుగా విధులు నిర్వహిస్తున్న బి.ప్రవీణ్, ఎమ్.దేవేంద్ర, 12 వ డివిజన్, 24వ డివిజన్ల సచివాలయాల వార్డు ప్లానింగ్ అండ్ రెగులేషన్ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్న పి. నాగేంద్ర బాబు, కె. కార్తీక్ మాలవ్య లను సస్పెండ్ చేశారు..ఆరోపణలపై వివరణ కోరుతూ పైన సూచించిన వారికి గతంలో కమిషనర్ షోకాజు నోటీసులు జారీ చేయగా, అందుకు వారు అందించిన వివరణ సంతృప్తికరంగా లేదని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నామని కమిషనర్ తెలిపారు.. వీరితో పాటు ఆరోపణలపై ఎల్.టి.పి దిలీప్ కుమార్ కు షోకాజ్ నోటీసును జారీ చేశారు.. ఎల్.టి.పి. నుంచి వ్రాతపూర్వక వివరణ అందుకున్నాక తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు..టి.పి.ఓ. ప్రవీణ్ స్థానంలో ఇంఛార్జిగా దశయ్య, దేవేంద్ర స్థానంలో ప్రకాష్ బాబులను అధికారులుగా నియమించినట్లు కమిషనర్ ప్రకటించారు..సంతకాల ఫోర్జరీపై విజిలెన్స్ విభాగం ద్వారా విచారణకు రాష్ట్ర డి.జి.విజిలెన్స్ అధికారులు విచారించి తగు నివేదికలను అందించాలని కోరుతు లేఖ ద్వారా కోరామని కమిషనర్ తెలియ చేశారు.

 

Spread the love
venkat seelam

Recent Posts

రూ.10,20 నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం-ఉత్తర్వులు జారీ చేసిన రిజర్వ్ బ్యాంకు

IPC సెక్షన్ 124A... అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం…

5 hours ago

ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను పెంచి అందించాం-మంత్రి నారాయణ

నెల్లూరు: ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాట ప్రకారం గతంలో ఇస్తున్నరూ.3వేలు పింఛన్‌కు రూ.వెయ్యి పెంచి రూ.4వేలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందించారని,…

5 hours ago

నెల్లూరు గవర్నమెంట్ డాక్టరు జ్యోతిది ఆత్మహత్యేనా ?

డాక్టరు జ్యోతి మరణం వెనుక వున్న కారణం ఏమిటి అనే “నిజం” పోస్టుమార్టం తరువాత వెలుగులోకి వస్తుందా ? లేక…

6 hours ago

ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా పనిచేస్తాను-పవన్ కళ్యాణ్

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో…

7 hours ago

జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న 8,500 ఉద్యోగులు-మంత్రి నారాయణ

జిల్లాలో 313757మంది లబ్ధిదారులకు రూ. 214.50 కోట్లు.. నెల్లూరు: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం…

1 day ago

రాజకీయ నేతల గుప్పెట్లో క్రీడా సంఘాలు బందీ అయ్యాయి-క్రీడాకారులు

పవన్ కల్యాణ్ హామీ.. అమరావతి: గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్నీ రంగాలూ అథోగతి పాలయ్యాయని, అలాగే క్రీడారంగం సైతం…

1 day ago

This website uses cookies.