నెల్లూరు: జిల్లాలో ఉల్లిపాయలు, టమోటాల ధరలు పెరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం జె.సి నిర్వహించారు. ఎండ వేడిమి ప్రభావంతో టమోటాలు, ఉల్లిపాయలతో పాటు ఇతర కూరగాయలు దిగుబడులు గణనీయంగా తగ్గాయని, దీంతో ధరలు పెరిగాయని, ప్రతిఏటా ఇదే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. టమోటాలు, ఉల్లిపాయల ధరలను స్థిరీకరించుటకు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పొరుగు జిల్లాల నుంచి టమోటాలు, ఉల్లిపాయలను సేకరించి రైతుబజార్లలో ద్వారా ఎలాంటి లాభనష్టాలు లేకుండా వినియోగదారులకు విక్రయించాలన్నారు. మార్కెటింగ్, పౌరసరఫరాలు, తూనీకల కొలతలు, ఉద్యాన, వ్యవసాయ శాఖల అధికారులతో ఏర్పాటైన విజిలెన్స్ కమిటీ ద్వారా వ్యాపారస్తుల దుకాణాలు, గోదాముల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎవరైనా అవసరానికి మించి ఎక్కువ నిల్వ చేసి అధిక ధరలకు విక్రయించినట్లు గుర్తిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను జె.సి ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ ఏడి అనితకుమారి, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, ఎపిఎంఐపి పిడి శ్రీనివాసులు, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటరమణ, తూనీకల కొలతల డిసి ఇసాక్, రైతు బజారు అధికారులు పాల్గొన్నారు.
IPC సెక్షన్ 124A... అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం…
నెల్లూరు: ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాట ప్రకారం గతంలో ఇస్తున్నరూ.3వేలు పింఛన్కు రూ.వెయ్యి పెంచి రూ.4వేలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందించారని,…
డాక్టరు జ్యోతి మరణం వెనుక వున్న కారణం ఏమిటి అనే “నిజం” పోస్టుమార్టం తరువాత వెలుగులోకి వస్తుందా ? లేక…
అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో…
జిల్లాలో 313757మంది లబ్ధిదారులకు రూ. 214.50 కోట్లు.. నెల్లూరు: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం…
పవన్ కల్యాణ్ హామీ.. అమరావతి: గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లోని అన్నీ రంగాలూ అథోగతి పాలయ్యాయని, అలాగే క్రీడారంగం సైతం…
This website uses cookies.