AMARAVATHI

జూన్‌ 5వ తేది నాటికి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు

అమరావతి: నైరుతి రుతుపవనాలు కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించాయని,,జూన్‌ 5వ తేది నాటికి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది..ప్రీ మాన్‌సూన్‌ వల్ల మరో 2,, 3 రోజులు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని తెలిపింది..వాయువ్య ప్రాంతాల నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావం నేరుగా రాష్ట్రంపై పడటంతో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నా నేపధ్యంలో పగటి,, రాత్రి పూట ఉష్ణోగ్రతలు అధికంగా వుంటున్నాయి..తేమలేని పొడిగాలుల కారణంగా ఎండ తీవ్రత బాగా పెరిగింది..కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎండ దెబ్బకు నేల సెగలు రేగుతున్నాయి.. రుతుపవనాల ప్రభావంతో కేరళలోని పలు జిల్లాల్లో విస్తారంగా కుండపోతు వర్షాలు కురుస్తున్నాయి.. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి..రాబోయే రెండు,మూడు రోజుల్లో రుతుపవనాలు  రాష్ట్రంలోకి విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది..ఈ సంవత్సరం లానినో అనుకూల పరిస్థితులు,,, భూమధ్యరేఖ వద్ద పసిఫిక్‌ మహాసముద్రం చల్లబడడం వంటి కారణాలతో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *