నెల్లూరు: తుఫాను కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించకుండా జిల్లా అధికార యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్”అసని”తుఫాను నేపథ్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు నిరంతరం గ్రామీణ ప్రాంతాల పరిస్థితిపై సమీక్షించాలన్నారు.. విద్యుత్,అగ్నిమాపక, పోలీస్, పురపాలక శాఖ, మండల స్థాయి అధికారులు ప్రతి ఒక్కరు సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారు. సహాయక కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై మంత్రి జిల్లా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు..ఈ కార్యక్రమంలో కలెక్టర్ చక్రధర బాబు,జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్ జాహ్నవి, ఏఎస్పీ వెంకటరత్నం విఆర్వో వెంకట రమణమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు..
అసని తుఫాన్ పై సమీక్షా-ఎటువంటి ప్రాణనష్టం లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలి-మంత్రి కాకాణి
