పుతిన్కు రెడ్ కార్పరెట్ ఆహ్వానం పలికిన కిమ్ జాంగ్ ఉన్
అమరావతి: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఉత్తర కొరియా చేరుకున్నారు.. రాజధాని ప్యోంగ్యాంగ్లో నార్త్ కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్,, పుతిన్కు రెడ్ కార్పరెట్ ఆహ్వానం పలికారు..దాదాపు 9 గంటల పాటు పుతిన్, ఉత్తర కొరియాలో ఉంటారు.. ఇద్దరి నేతల మధ్య 90 నిమిషాల పాటు చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.. గత సంవత్సరం సెప్టెంబర్లో కిమ్, రష్యాలో పుతిన్ ను కలుసుకున్నారు.. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు, కీలకమైన ఆయుధాలను ఉత్తర కొరియా సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి..పుతిన్ పర్యటన ఇరు దేశాల మధ్య మిలిటరీ బంధాన్ని బలోపేతం చేయనున్నట్లు తెలుస్తోంది..పుతిన్ రాక సందర్భంగా సెంట్రల్ స్క్వేర్ను కలర్ఫుల్గా డెకరేట్ చేశారు..భారీ ఎత్తున పరేడ్ను నిర్వహించారు..చిన్న పిల్లలు బెలూన్లుతో పుతిన్ కు స్వాగతం పలికారు.