AMARAVATHIPOLITICS

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలిపి 81.76 శాతం మేర పోలింగ్ జరిగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో సరాసరిన 80.07 శాతం పోలింగ్ నమోదు కాగా, పోస్టల్ బ్యాలెట్‌ 1.10 శాతం మేర నమోదైంది.. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.09,, పల్నాడు జిల్లాలో 85.65,, బాపట్ల జిల్లాలో 84.98, కృష్ణా జిల్లాలో 84.05 శాతం పోలింగ్‌ జరిగింది.. కోనసీమ జిల్లాలో 83.91,, అనకాపల్లి జిల్లాలో 83.84,, ఏలూరు జిల్లాలో 83.55 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది..శ్రీసత్యసాయి జిల్లాలో 82.77, పశ్చిమగోదావరి జిల్లాలో 82.70, చిత్తూరు జిల్లాలో 82.65 శాతం నమోదైనట్లు వెల్లడించింది..విజయనగరం జిల్లాలో 81.34,, తూర్పుగోదావరి జిల్లాలో 80.94,, నంద్యాల జిల్లాలో 80.92,, కాకినాడ జిల్లాలో 80.31 శాతం పోలింగ్‌ నమోదైంది..ఎన్టీఆర్ జిల్లాలో 79.68,,వైఎస్సర్ జిల్లాలో 79.40,, అనంతపురం జిల్లాలో 79.25,, గుంటూరు జిల్లాలో 78.81,, నెల్లూరు జిల్లాలో 78.10 శాతం పోలింగ్‌ జరిగింది.. తిరుపతి జిల్లాలో 77.82,, పార్వతీపురం మన్యం జిల్లాలో 77.10,, అన్నమయ్య జిల్లాలో 76.23,, శ్రీకాకుళం జిల్లాలో 76.07,, కర్నూలు జిల్లాలో 75.83,,అల్లూరి జిల్లాలో 70.20,, అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది..

2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే దాదాపు 1.60 శాతం మేర అదనంగా పోలింగ్ జరిగినట్టు ఈసీ తెలిపింది.. రాష్ట్రంలో మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లకు గాను 3.35 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలుస్తొంది..అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా దర్శిలో 90.91 శాతం కాగా కనిష్టంగా తిరుపతిలో 59.95 శాతం నమోదైంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *