ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన అధికారులను సస్పెండ్ చేసిన ఈసీ,,వారి స్థానంలో కొత్తవారికి పోస్టింగులు ఇచ్చింది..నరసరరావుపేట DSPగా ఎం సుధాకర్ రావు,, గురజాల DSPగా సీహెచ్ శ్రీనివాసరరావు,, తిరుపతి DSPగా కే.రవి మనోహర్ చారి,, తాడిపత్రి DSPగా కే.జనార్దన్ నాయుడు,,, తిరుపతి SBగా ఎం వెంకట్రాది,, పల్నాడు స్పెషల్ బ్రాంచ్ CIలుగా బీ.సురేష్ బాబు, యూ.శోభన్ బాబులు,,కారంపూడి SIగా కే.అమీర్, నాగార్జున సాగర్,, ఎం పట్టాభి, తిరుపతి SB ఇన్స్పెక్టర్గా ఏ విశ్వనాథ్, అలిపిరి CIగా ఎం రామారావు, తాడ్రిపత్రి CIగా పీ.నాగేంద్ర ప్రసాద్లు నియామకం అయ్యారు..కొత్తగా బాధ్యతలు నియమితులైన అధికారులు అందరినీ తక్షణమే విధుల్లో చేరేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ DGPకి ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది..