నెల్లూరు సెంట్రల్ జైలు వైసీపీ నెతలకు బాగా కలిసి వచ్చిందా? వరుసలో పిన్నెల్లి
(21-01-2016)- సెంట్రల్ జైల్ లో వున్న మిథున్ రెడ్డి,చెవిరెడ్డి.భాస్కర్ రెడ్డి,మాధుసూదన్ రెడ్డిలను అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ములాఖత్ లో కలిశారు.వైసీపీ నెతలకు నెల్లూరు సెంట్రల్ జైలు బాగా కలిసి వచ్చిందంటూ టీడీపీ నేతలు ఎధ్దేవా చేస్తున్నారు.)
అమరావతి: ఎన్నికల సమయంలో EVMల ధ్వంసం, మహిళపై దాడి కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బుధవారం రాత్రి మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పోలీసులు హాజరు పర్చారు..జడ్జి, రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించడంతో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.. ఎన్నికల సమయంలో అల్లర్లు కేసులో పిన్నెల్లిపై మరో మూడు కేసులు నమోదయ్యాయి..ఇందులో సీఐ నారాయణ స్వామి, టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై హత్యాయత్నం కేసులో కోర్టు రిమాండ్ విధించగా,, EVMల ధ్వంసం, మహిళపై దాడి కేసుల్లో పిన్నెల్లికి బెయిల్ మంజూరైంది..పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు..ప్రస్తుతం అయన పరారీలో ఉన్నారు.