AMARAVATHI

ప్రభుత్వ సుస్థిరత, నిజాయితీని నమ్మడంతోనే ప్రజలు మళ్లీ అవకాశం ఇచ్చారు-రాష్ట్రపతి

అమరావతి: లోక్‌సభ సమావేశాలు 4వ రోజు ప్రారంభమైన సందర్బంగా, 18వ లోక్‌సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  తొలిసారి ప్రసంగించారు..2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొంది ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేసిన సభ్యులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు..దేశ ప్రజల విశ్వాసాన్ని గెలిచి లోకసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయరని భావిస్తున్నట్లు చెప్పారు.. ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతమవుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు..భారతదేశ ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ,, సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు..ప్రపంచమంతా భారత ఎన్నికలను నిశితంగా పరిశీలించిందని,,దేశ ప్రజలు ప్రభుత్వాన్ని విశ్వసించి మళ్లీ పట్టం కట్టారన్నారు..ప్రభుత్వ సుస్థిరత, నిజాయితీని నమ్మడంతోనే ఈ ఎన్నికల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారన్నారు.. రిఫార్మ్‌,, పర్‌ఫార్మ్‌,,ట్రాన్స్‌ ఫార్మ్‌ ఆధారంగా ప్రజలు తీర్పు ఇచ్చారని వెల్లడించారు..గడిచిన పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేయడంతో పాటు పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు..త్వరలోనే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోందని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

సీబీఐ కోర్టులో ఉన్న జగన్‌ కేసులను రోజువారీగా విచారించండి-తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.. జగన్ కేసులకు…

8 hours ago

తిరుమలలో దళారుల ఏరివేతకు చర్యలు తీసుకోండి – టీటీడీ ఈవో జె.శ్యామలరావు

తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో జె.శ్యామలరావు…

8 hours ago

రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు

నెల్లూరుకు ఒ.ఆనంద్.. అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కలెక్టర్​లను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. శ్రీకాకుళం…

1 day ago

తిరుపతి జిల్లా కలెక్టర్ గా డా.ఎస్. వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్

తిరుపతి: డైరెక్టర్ సెకండరీ హెల్త్ గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న డా.ఎస్.వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ గా…

1 day ago

రూ.249కి కొత్త ప్లాన్ ప్రవేశ పెట్టిన BSNL

అమరావతి: దేశీయ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ (BSNL) వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒక కొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది.. దీని…

1 day ago

రూ.10,20 నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం-ఉత్తర్వులు జారీ చేసిన రిజర్వ్ బ్యాంకు

IPC సెక్షన్ 124A... అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం…

2 days ago

This website uses cookies.