నెల్లూరు జిల్లాకు మే నెలకు 3,14,422 మంది లబ్ధిదారులకు పింఛన్లు-కలెక్టర్
నెల్లూరు: పించన్ నిధులు జూన్ 1వ తేదిన పించన్ దారుల ఆధార్ నెంబర్ తో అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్ కు జమ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు..పింఛన్ల బట్వాడా జూన్ 1వ తేది నుంచి 5వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. 2,28,471 మంది పింఛన్ లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా చెల్లింపు జరుగుతాయన్నారు..బ్యాంక్ అకౌంట్ లేని 85,951 మంది పింఛన్ లబ్ధిదారులకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు..పింఛన్ కోసం లబ్ధిదారులు ఎవరూ కూడా గ్రామ, వార్డు సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లొద్దని సూచించారు..బ్యాంకుల వద్ద ఫించన్ దారులందరికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించారు.