జూన్ 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు-లోక్సభ స్పీకర్ ఎన్నిక
అమరావతి: కేంద్రంలో కొత్త ప్రభుత్వం బాధ్యతల చేపట్టిన తరువాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, 71 మంది ఎంపీలకు శాఖలు కూడా కేటాయించడంతో మంగళవారం వారందరూ బాధ్యతలు చేపట్టారు..ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం 18వ పార్లమెంట్ తొలి సమావేశాల నిర్వహించాలని నిర్ణయించింది..ఈ సమావేశాల్లో లోక్సభ స్పీకర్ ఎన్నిక, కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుందని,, 8 రోజులపాటు ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు సంబంధిత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.. జూన్ 24 నుంచి జులై 3 వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు వెల్లడించాయి.. జూన్ 24, 25 తేదీల్లో కొత్త పార్లమెంట్ సభ్యులు ప్రమాణం స్వీకారం,, జూన్ 26వ తేదిన లోక్సభ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.