ఎన్డీయే ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశం
ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం..
అమరావతి: రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం జరిగింది..దాదాపు 3.30 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గ సభ్యులు పలు కీలక అంశాలపై చర్చించారు..ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో బాగంగా సీఎం చంద్రబాబు చేసిన ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. వీటిలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ,,ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు,, ఏప్రిల్ నుంచి పింఛను రూ.4వేలకు పెంపు,, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ,, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది..జూలై 1 నుంచి పెంచిన పించన్లు అంద చేయాలని కేబినెట్ నిర్ణయించింది..ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి పెన్షన్ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది.. దీంతో జులై 1న ఒకేసారి 65లక్షల మందికి ఇంటి వద్దే రూ.7,000 పెన్షన్ అందుకోనున్నారు..ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి యథావిధిగా నెలకు రూ.4వేలు పెన్షన్ వస్తుంది..విజయవాడలోని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును పాత పేరు అయిన NTR వర్సిటీగా మార్పునకూ కేబినెట్ ఆమోదం తెలిపింది.