AMARAVATHINATIONAL

అసదుద్దీన్ ఒవైసీపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాసిన నవనీత్ రాణా

అమరావతి: మహారాష్ట్ర అమరావతి లోకసభ మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా, ఎంపీగా ప్రమాణం చేస్తూ జై పాలస్తీన అంటూ వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు.. ఈ మేరకు రాష్ట్రపతికి నవనీత్ రాణా గురువారం లేఖ రాశారు.. అసదుద్దీన్ ఒవైసీ తన ప్రమాణం స్వీకార కార్యక్రమంలో ‘జై పాలస్తీనా’ నినాదాన్ని లేవనెత్తడం ద్వారా భారత్‌కు బదులుగా మరో దేశానికి విధేయతను వ్యక్తం చేశారని ఆమె తన లేఖలో పేర్కొన్నారు..తన డిమాండ్‌కు మద్దతుగా రాజ్యాంగంలోని 102, 103 ప్రకరణలను ఆమె ఉదాహరించారు..ఈ ప్రకరణలు ఒవైసీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడానికి ఉపకరిస్తాయని ఆమె స్పష్టం తెలిపారు..2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలు,, జూన్ 25వ తేదీన ప్రమాణం చేశారు.. ఈ ప్రమాణంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ,,, జై బీమ్,,, జై మీమ్,,, జై తెలంగాణ,,, “జై పాలస్తీనా” అంటూ వ్యాఖ్యలు చేశారు.. ఈ వ్యాఖ్యలపై సభలోని పలువురు కేంద్ర మంత్రులతోపాటు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.. దాంతో ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న రాధా మోహన్ సింగ్ స్పందిస్తూ, ఒవైసీ చేసిన వ్యాఖ్యలను పరిశీలించి రికార్డుల నుంచి తొలగిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *