ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కు అస్వస్థత-ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స
అమరావతి: భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ (73) ఆదివారం వేకువజామున అస్వస్థతకు గురయ్యారు..కుటుంబ సభ్యులు ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో అర్ధరాత్రి 2 గంటల సమయంలో చేర్చారు..ఛాతీలో నొప్పి కారణంగా ఉప రాష్ట్రపతి ఆస్పత్రిలో చేరారని వైద్యులు తెలిపారు.. కార్డియాలజీ హెచ్వోడీ డాక్టర్ రాజీవ్ నారంగ్ మాట్లాడుతూ ఉప రాష్ట్రపతి ధన్ఖడ్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని,, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు..ఉప రాష్ట్రపతిని క్రిటికల్ కేర్ యూనిట్(CCU) లో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు..సమాచారం కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఢిల్లీ ఎయిమ్స్ కు వెళ్లి ఉప రాష్ట్రపతిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.