శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్
తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన జస్టిస్ డివై.చంద్రచూడ్ కు టిటిడి ఈవో శ్యామల రావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్యచౌదరి స్వాగతం పలికారు.. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్కు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు.అనంతరం టీటీడీ ఈవో, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తీర్థప్రసాదాలు అందజేశారు..
ప్రధాన న్యాయమూర్తికి వీడ్కోలు:- సీజెఐ చంద్రచూడ్, తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమైన సందర్బంలో అయనకు అధికారులు సాదర వీడ్కోలు పలికారు.