పట్టాలెక్కుతున్న తొలి హైడ్రోజన్ రైలు-ముహూర్తం, రూట్, ప్రత్యేకతలు
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దర్శనికత,,కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గఢర్కీ చొరవతో దేశంలో తొలి హైడ్రోజన్ రైలు పరుగులు పెట్టేందుకు ముమూర్తం ఖరారైంది.. ఇప్పటి వరకు డీజిల్, విద్యుత్ రైళ్లు నడుస్తుండగా, హైడ్రోజన్తో నడిచే తొలి రైలు అందుబాటులోకి రాబోతోంది..
దేశంలోనే తొలి హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది..ఈ రైలును తొలుత మార్చి నుంచి ప్రారంభించాలి అనుకున్నప్పటికి సాంకేతిక కారణల రీత్యా జూలై నుంచి హరియాణాలోని జీంద్ నుంచి సోనిపత్ మధ్య నడవనుంది..ఈ రైలుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి..ఈ రైలు ప్రారంభం అయిన తరువాత దశల వారీగా విస్తరణ చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
రూ.80 కోట్ల ఖర్చు:- భారతీయ రైల్వేలోని రీసెర్చ్, డిజైన్, స్టాండర్డ్ సంస్థ తొలి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు డిజైన్ను రూపొందించింది..ఈ రైలు గరిష్ఠంగా గంటకు 110 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ఇన్నోవేషన్ కింద హైడ్రోజన్ పవర్తో నడిచే 35 రైళ్లను నడపాలని రైల్వే భావిస్తోంది.. ప్రతి రైలు తయారీకి దాదాపు 80 కోట్లు ఖర్చు అవుతోంది.. గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అదనంగా రూ.70 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తోంది.. హెరిటేజ్, హిల్స్టేషన్స్ రూట్స్ లో ఈ రైళ్లను నడపేందుకు ప్రణాళికలు రచిస్తోంది..
తుది దశకు పనులు:- హైడ్రోజన్తో నడిచే రైలు నిర్మాణ పనులు చెన్నైలో జరుగుతున్నాయని,,సదరు పనులు చివరి దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు.. హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, భద్రత పరమైన జాగ్రత్తలు తీసుకొవడం జరుగుతుందన్నారు..చెన్నైలో తయారు చేస్తున్న రైలును జీంద్కు తీసుకువచ్చాక ట్రయల్ రన్ జరుగుతుందని తెలిపారు..అటు తరువాత మాత్రమే జీంద్, సోనిపత్ మధ్య సజావుగా ప్రయాణం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు..అయితే హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణం రెండు నెలల్లో పూర్తి కానున్నది.. ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ అశోక్ వర్మ ఆదివారం హైడ్రోజన్ ప్లాంట్ను పరిశీలించారు..
విస్తరణ ప్రణాళికలు:- జీంద్లోని వాషింగ్ లైన్ను ప్రస్తుతం 17 కోచ్ల సామర్థ్యంతో ఉండగా,, దాన్ని 23 కోచ్లకు విస్తరించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.. దీనిపై ఆయన అధికారులు కసరత్తు కొనసాగిస్తు న్నారు..మరో 6 కోచ్ ల విస్తరణకు పనులు ప్రారస్తున్నమని తెలిపారు..కొత్త రైల్వే జంక్షన్ పునరుద్ధరణ పనులు ఆగస్టు-సెప్టెంబర్ నాటికి పూర్తి కానున్నాయి.. 40 వేల లీటర్ల నీటిని ఈ హైడ్రోజన్ రైలు ఉపయోగించు కోనుంది.. ఒకసారి ట్యాంక్ నింపితే 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని అధికారులు వెల్లడించారు.. తొలిసారి హైడ్రోజన్తో నడిచే రైలు అందుబాటులోకి రానుండటంతో దేశ ప్రజల్లో ఆసక్తి నెలకొంది.