అగ్ని ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి
మృతి చెందిన దివ్యాంగురాలికి రూ. 50వేలు..
నెల్లూరు: నగరంలోని రంగనాయకులపేటలోని బర్మాషెల్ గుంటలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో దివ్యాంగురాలు నాగలక్ష్మి మృతి చెందడంపై నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల్ని అన్నీ విధాలా ఆదుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. తక్షణ సహాయం కింద బాధితులకి రూ.15 వేలు తన తరపున టీడీపీ నాయకులు అందచేసినట్లు నారాయణ కార్యాలయం ప్రకటించింది..చనిపోయిన దివ్యాంగురాలికి రూ. 50 వేలు అందచేశారు.