రాష్ట్రాలకు లేఖలు..
అమరావతి: ప్రపంచాన్ని హడలెత్తించిన కోవిడ్-19 మహమ్మారి కేసులు దేశంలో భారీగా తగ్గు ముఖం పట్టాయి.దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది..మార్చి 31వ తేది నుంచి దేశ వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు ఎత్తివేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు..దాదాపు రెండు సంవత్సరాల తరువాత వైరస్ నియంత్రణకు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.కొవిడ్ కట్టడి కోసం 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం కింద మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కోవిడ్ నిబంధనలు ఎత్తివేసినా,,ప్రజలంతా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తాజా ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం..వైరస్ నియంత్రణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది..రాష్ట్రాలలో కేసులు పెరుగెతే స్థానికి ప్రభుత్వాలు నిబంధనలు విధించుకోవచ్చు అని కేంద్ర హౌం శాఖ సూచించింది..ఫేస్ మాస్క్ ల వాడకంతో సహా కోవిడ్ నియంత్రణ చర్యలపై సలహాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది.